2013-07-31

త్రింశాంశ

ఈ రోజు మనము త్రిశాంశ ను గురించి తెలుసు కొందాం ?
త్రిశాంశ అంటే ఏమిటి ?

జాతకులు పుట్టిన జన్మలగ్నమును , జాతకమునందు గ్రహములు ఏ ఏ రాశులలో ఉన్నాయో ఆయా రాశులను ౩౦ భాగాలుగా విభజించాలి . దీనినే త్రిశాంశ అంటారు . అయితే ప్రతి రాశికి ఈ త్రిశాంశ ఒకేలా ఉండదు .త్రిశాంశ ౩౦ భాగాలకు కుజాది పంచ గ్రహములే అధిపతులగు చున్నారు . అయితే బేసి రాశులైన మేష , మిధున , సింహ , తుల, ధనుస్సు , కుంభ రాశులకు వరుసగాను , సరి రాశులైన వృషభ , కర్కాటక , కన్య , వృశ్చిక , మకర , మీన రాశులకు వ్యతిరేఖముగానూ చూడాలి .


త్రిశాంశ ౩౦ భాగాలకు జన్మ లగ్నము గానీ , జన్మ రాశి గానీ బేసిరాశి  అయితే మొదటి 5 భాగాలకు కుజుడు తరువాత 5  భాగాలకు శని ఆ తరువాత 8 భాగాలకు గురుడు 7 భాగాలకు బుధుడు 5 భాగాలకు శుక్రుడు అధిపతులు అగుదురు అదే జన్మ లగ్నము జన్మ రాశి గానీ సరి రాశి అయితే 5 భాగాలకు శుక్రుడు 7 భాగాలకు బుధుడు 8 భాగాలకు గురుడు 5 భాగాలకు శని చివరి 5 భాగాలకు కుజుడు అధిపతులు అగుచున్నారు ..

ఇక్కడ గమనించవలసిన విషయము వివాహ సంభందము చూసుకొనే సమయములో స్త్రీ యొక్క లక్షణములను , గుణమును , ప్రవర్తననూ తెలుసుకొనుటకు ఈ త్రిశాంశ పద్దతి ఉపయోగ పడుననీ మహర్షుల అభిప్రాయము . అందు వలనేమో స్త్రీ జాతకమును పరిశీలించే టపుడు త్రిశాంశ తప్పక విచారించ వలెననీ తెలిపి యున్నారు . అయితే స్త్రీ పురుషుల ఇద్దరికీ త్రింశాంశ విచారణ చేయుట మంచిదని నా అభిప్రాయము .  

ఈ త్రిశాంశ భాగాలలో జన్మించిన వారి ఫలితములు ఎట్లుండునో తరువాత శీర్షికలో తెలుసు కుందాం .వివరిస్తాను .   

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...