2013-07-30

జ్యోతిష్యశాస్త్రము- అవసరము



          శ్లోకం :   యద్దినే పతతేశుక్రః మాతృ గర్భేణ నిర్మితః
                   లలాటే లిఖితే ధాతా లాభాలాభ శ్శుభాశుభః

తాత్పర్యము : ఏ దినమున శుక్లము పడినదో అప్పటి నుండి తల్లి గర్భములో అండము పిండముగా మారి జీవి స్వరూపమును, నిర్మాణము జరిగే సమయములోనే ఆ జీవియొక్క భవిష్యత్తును గురించి వ్రాయబడుతుంది . పుట్టిన తరువాత జీవితమున కలుగు లాభము , నష్టము , శుభము , అశుభము మొదలగు సమస్త విషయములను సృష్టికర్త యైన బ్రహ్మదేవుడు నుదిటిపై లిఖిస్తాడు .
    ,
జ్యోతిష్యము అనగా మార్గనిర్దేశనము చేసేది.

దీపం వెలుగుతూ ఉన్నప్పుడు చీకటిని పారద్రోలి కాంతిని ప్రసరిస్తుంది.. అలాగే జ్యోతిష్యము కూడ మానవుని జీవన ప్రయాణములో ఏది మంచి , ఏది చెడు అని తెలుసుకోవడానికి ఉపయోగ పడుతుంది. ఏ శాస్త్ర , సాంకేతికత లేని రోజుల్లో కార్తెలను తెలుసుకొని ఆయా కాలానుగుణముగా పంటలు వేసేవారు . కార్తెలకు అనుగుణముగా వేర్వేరు పంటలను పండించేవారు . మన భారతీయ సాంప్రదాయములను, ఆచారములను, తెలియపరస్తుంది .పండుగలు మొదలగు వాటి గురించి తెలుసు కోవచ్చు . ఇలా అనేక విధములుగా జ్యోతిష్య శాస్త్రము మనకు ఉపయోగ పడుతుంది . 
ఈనాడు మానవుడు సృష్టికి ప్రతి సృష్టి చేయుచున్నాడు . వాతావరణమును తనకు అనుకూలంగా మార్చుకొను చున్నాడు .:
1  వేసవి కాలము : విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు ఉష్ణోగ్రత ప్రభావమును తట్టుకొనుటకు వీలుగా ఏ సి కనుగొన్నాడు . చల్లని పదార్ధములు భుజించడం , చెవులకు గుడ్డలు కట్టుకోవడం , టోపీలు ధరించడం మొదలగు జాగ్రత్తలు తీసుకొంటున్నాడు
2 వర్షాకాలము : బాగా వర్షం కురుస్తుంది . ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాలి .వర్షములో తడవకుండా ఉండడానికి గొడుగు కనిపెట్టాడు . వైరల్ పీవర్స్ , అంటువ్యాధులు రాకుండా జాగ్రత్త పడుతున్నాము .
౩శీతాకాలము : విరీతమైన చలి కాలములో చలి నుండి తట్టుకోడానికి హీటర్లు కని పెట్టాడు .రగ్గులను కప్పుకోవడం , కాటన్ బట్టలు వాడడం , ఇలా అనేక జాగ్రత్తలు తీసుకొంటున్నాం .

ఇక్కడ ఒక విషయమును మనం గమనించాలి . అది ఏమిటంటే మానవుడు మొదట ప్రకృతికి అనుకూలముగా మారాడు . తరువాత ప్రకృతిని తనకు అనుకూలముగా మార్చుకోసాగాడు . అయితే ఏది చేసినా ఎంత చేసినా ఈ ప్రకృతి ఒడిలో ప్రకృతికి లోబడే చెయ్యాలి . మానవుడు ఒంటరివాడు కాదు. నలుగురితో కలసి బ్రతకాలి. సమాజములో తానొక్కడు మాత్రమే . కష్ట సుఖములలో , శారీరకముగా , మానసికముగా ఒకరికి ఒకరు తోడుండే వ్యవస్థలను ఏర్పాటు చేసుకొన్నాడు .

భగవంతుని పూజిస్తూ శాస్త్రమున తెలుపబడిన శాంతి కర్మలను తన ఆచార సంప్రదాయములకు అనుగుణముగా ఆచరించుట వలన కష్టములు తొలగి ఆయురారోగ్యము , ఐస్వర్యములను పొందుచున్నాడు .   

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...