వధూవరులకు వివాహ పొంతన చూసేటప్పుడు ముఖ్యముగా 8 కూటములను పరిగణన లో
తీసుకొన్నారు .
1 వర్ణకూటమి 2 వశ్యకూటము ౩
తారాకూటమి 4 యోనికూటము 5 గ్రహకూటమి 6.
గణకూటమి 7 రాశికూటమి 8 నాడీకూటమి
వర్ణకూటమి : స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే వర్ణమునకు చెందిన వారయితే
మంచిది.
రవి , కుజులు క్షత్రియులు , గురు , శుక్రులు బ్రాహ్మణులు , బుధ,
చంద్రులు వైశ్యులు, శని శూద్రుడు, రాహు కేతువులు మ్లేచ్చులు
2 . వశ్యపొంతన : మేషరాశికి - సింహము ,వృశ్చికం, వృషభ రాశివారికి – కర్కాటక ,తులారాశులు , మిదునమునకు – కన్యరాశి, కర్కాటకరాశికి
– వృశ్చికం, ధనుస్సు , సింహరాశికి – తులారాశి , కన్యకు – మిధున , మేషములు , తులా రాశికి – కన్య, మకరం, వృశ్చికరాశికి – కర్కాటకం ,ధనుస్సుకు – మీనము ,
మకర రాశికి – మేషం ,
కుంభం కుంభరాశికి – మేషము ,
మీనమునకు – మకరం ఈ
విధంగా పై రాశులు వశ్యము కలిగి ఉన్నవి . వధూవరులు ఇద్దరి రాశులు వశ్య పొంతన
కలిగి ఉండవలెను .
౩. తారా పొంతన : స్త్రీ జన్మ నక్షత్రమునుండి పురుషుని జన్మ నక్షత్రము
వరకు లెక్కించిన సంఖ్యను 9 చే భాగించగా 1 , ౩ , 5 , 7 శేషము రాకూడదు
4 . యోనిపొంతనము : పులి – ఆవు , పిల్లి – ఎలుక ,
లేడి – కుక్క , గుఱ్ఱము – దున్న , పాము – ముంగిస ,
సింహం – ఏనుగు , కోతి- మేక
ఇవి విరోధ జంతువులు ఇంతకు ముందర నక్షత్రములు – వివరణ అను శీర్షికలో నక్షత్రములు జంతువులను గూర్చి వివరించితిని .
వధూవరుల ఇరువురు నక్షత్రములు విరోధ జంతువులకు సంబంధించినవి కాకూడదు . ముఖ్యముగా యోనిపొంతన అవసరము .
5 గ్రహకూటమి : సూర్యుడు – శని , చంద్రుడు – బుధుడు ,
కుజుడు –బుధుడు .గురుడు –శుక్రుడు ఈ పైన తెలిపిన గ్రహములు ఒకరికొకరు పరస్పం శత్రువులు గ్రహ
కూటమి ని చూసేటప్పుడు పై విధంగా ఉండ కూడదు.
6 గణ కూటమి : ఇరువురు ఒకే గణమునకు చెందిన వారైతే నిర్భయంగా వివాహము చేయవచ్చును
. ఒకరిది దేవగణం , మరియొకరిది రాక్షస గణమైన కొద్ది ఇబ్బండులున్ననూ చేయవచ్చును ,
రాక్షస మానుష్య గణములు మృత్యుప్రదమని సూచించిరి . కానీ ప్రస్తుత కాలములో గణ పొంతన వలన
అంత అపాయములు జరుగుటలేదు .
7. రాశి పొంతనము : వధూ వరుల ఇరువురి రాశులు పరస్పరం మిత్రత్వము కలిగి
ఉండవలెను . స్త్రీ రాశి నుండి పురుష రాశి 7 రాశుల కన్నా ఎంత ఎక్కువ ఉంటె అంట
మంచిది . దీనినే స్త్రీ దీర్గ పొంతన అని అందురు . ఇరువురి రాసులలోనూ ద్వి, ద్వా దశము
, షష్ఠ , అష్టకములు కాకూడదు . ఇది చాలా చాలా ముఖ్యము , ద్వి ద్వా దశము వలన అంతగా
ప్రమాదము జరుగుట లేదు కానీ , షష్ట అష్టక స్థితి వలన చాలామంది , విడాకులు
తీసుకోవడమో ,,అనారోగ్యము పొంది జీవితము అంధకారమగుచున్నది . ఒక్కొక్కప్పుడు ప్రాణ
నష్టము సంభవించు చున్నది .
8 నాడీపొంతనము : వధూవరులు ఇద్దరూ వేర్వేరు నాడులకు చెందిన వారై ఉండాలి
. ఏక నాడియందు వివాహము చెయ్యరాదు .
“ఆద్యే సుత హత: ,అంత్యే ధన హత: మధ్యే వనితా పతి వియోగ : “
అని చెప్పబడిన కారణము వలన దంపతులు ఇరువురు ఆది నాడికి చెందిన వారైతే
సంతాన నష్టము కలుగునని , అంత్య నాడికి చెందిన వారైతే ధనమునకు ఇబ్బంది ఏర్పడుననీ ,
మధ్యనాడి చెందిన వారైతే స్త్రీ పురుషుల మధ్య వియోగము ఏర్పడునని , ఎడబాటు కలుగుననీ
చెప్పితిరి .
కావున ప్రతి ఒక్కరు వివాహ పొంతనలను చూసుకొని వివాహము జరుపుకొనుట వలన
దాంపత్య జీవితము హాయిగా ఉంటుంది .
No comments:
Post a Comment