2014-03-12

మూర్తుల ప్రభావము

ఏ జాతకునకైనా ఫలితములను గురించి తెలుసు కోవాలని అనుకొన్నప్పుడు రెండు విధముల అనాలసిస్ అవసరం అవుతుంది .

అది ఒకటి గ్రహచారము , రెండవది గోచారము
గ్రహచారము అనగా మనం పుట్టినప్పుడు ఉన్న గ్రహముల స్థితి ఆధారముగా గ్రహములు పొందిన రాశి యొక్క స్వభావమును అనుసరించి గ్రహ దశలను తెలుసుకొని జన్మ లగ్నము లగాయితూ గ్రహములు పొందిన  ఆధిపత్యము ననుసరించి ఆయా గ్రహముల బలాబలములను  ఫలితములను తెలుసు కోవడం.

ఇక రెండవది గోచారము ఈ విధానములో వర్తమాన పరిస్థితులలో గ్రహముల గతిని అనుసరించి కలుగు మార్పులకు అనుగుణముగా మానవ జీవితముపై కలుగు  శుభ ,అశుభ ఫలితములను క్షున్నముగా తెలుసుకొనుటకు ఉపయోగ పడుతుంది .  గోచారము ప్రకారము గ్రహములకు ఫలితములను తెలుసుకోవాలని అనుకొన్నప్పుడు జన్మ లగ్నమును ప్రామాణికముగా తీసుకోకూడదు . ఇక్కడ జన్మ రాశి  మాత్రమే పరిగణన లో తీసుకోవాలి . ఎవరైనా ఒక వ్యక్తి యొక్క గోచారము ఫలితమును సులభంగా తెలుకోవడానికి మహర్షులు గ్రహములకు మూర్తి నిర్ణయము చేసినారు . ఈ మూర్తులను లోహములతో పోల్చి చూపారు .

పంచ లోహాలలో బంగారము , వెండి , రాగి , ఇత్తడి  , ఇనుము . ఇవి ఒకదానికన్న ఒకటి తక్కువ విలువ కలవి . ఉదా : బంగారము చాలా విలువ కలిగినది దానికన్నా వెండి తక్కువ విలువ దానికన్నా రాగి , దానికనా ఇత్తడి , దానికన్నా ఇనుము ఇలా విలువ తగ్గి పోతుంది .

ఈ లోహాలకున్న విలువలకు అనుగుణముగా సాధారణ మానవునకు కూడా సులభంగా అర్ధం అవుతుందనే ఉద్దేశ్యంతో మన పూర్వీకులు గ్రహములకు మూర్తి నిర్ణయము చేసారు .

1 సువర్ణమూర్తి (బంగారము )2 రజిత మూర్తి( వెండి )3 తామ్ర మూర్తి (రాగి ) 4 లోహ మూర్తి (ఇనుము 0 

సువర్ణ మూర్తి 100 %  శుభ ఫలితములను
 రజిత మూర్తి 75% శుభ ఫలితములను
తామ్ర మూర్తి 50% శుభ ఫలితములను
లోహ మూర్తి  25% శుభ ఫలితములను ఇచ్చును . ఈ గ్రహములకున్న మూర్తి ప్రభావము ప్రకారము   .

మూర్తి నిర్ణయము ఎలా చెయ్యాలి అనే విషయములను తదుపరి శీర్షికలో తెలుసు కుందాం .

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...