2013-08-25

తిధులు

గ్రహములన్నియు  తమతమ కక్ష్య లలో దీర్గ వృత్తాకారములో తిరుగు చున్నవి . అందువలననే  గ్రహములకు  శీఘ్రగతి, సమగతి, మందగతి, అతిచారము , స్తంభన అనే గతులను  ఏర్పరచినారు .

తిది : అనగా తేది అని అర్ధము . పూర్వకాలములో  ఈ తిధులనే ప్రామాణికముగా తీసుకొనేవారు . ఈ తిధులు చంద్రుని సంచారమును బట్టి ఏర్పడుచున్నవి . భూమి , చంద్రుడు,సూర్యుడు , ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు చంద్రుని నీడ భూమిపై పడుటవలన అమావాస్య ఏర్పడుచున్నది . ఈ సరళ రేఖను 0 డిగ్రీ అనుకోదాము . 0 దిగ్రిలనుంది  ప్రతి 12డిగ్రీల కు ఒక్కొక్క తిది ఏర్పడును .

 0 నుండి  12 డిగ్రీలను పాడ్యమి అని 12నుండి 24 డిగ్రీలను విదియ అని 24నుండి 36 డిగ్రీలను తదియ అని ఇలా ప్రతి 12 డిగ్రీలు చంద్రుడు సంచారమును బట్టి  చవితి పంచమి షష్టి సప్తమి అష్టిమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ { అమావాస్య } ఏర్పడుచుండును .

చంద్ర చారము  0 నుండి 180 దిగ్రిలవరకు వచ్చినప్పుడు భూమికి సూర్యునుకి మధ్య సమాంతరంగా  వచ్చుట వలన పూర్ణిమ ఏర్పడుచున్నది . 0 నుండి 180 డిగ్రీలకు  జరుగు చున్నప్పుడు వెన్నెల రోజురోజుకు క్రమక్రమముగా పెరుగుచుండును .  దీనినే శుక్లపక్షం అని అందురు . చంద్రుడు 180 వ డిగ్రినుండి 360 డిగ్రికి చంద్రుని గమనము ఉన్నప్పుడు తిరిగి అవే తిధులు క్రమముగా వచ్చు చుండును .  ఈ  విధంగా తిరిగి చంద్రుడు 0 డిగ్రీలకు చేరినపుడు అమావాస్య ఏర్పడు చున్నది .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...