2013-06-30

శుక్రాచార్యుడు ..2



ఈ విధంగా కచుడు శుక్రాచార్యుని వద్ద శిష్యుడుగా చేరాడు .
గురువుగారికి కావలసిన సకల సేవలు చేస్తూ వినయ విధేయతలు కలిగి బుద్ధిగా ప్రవర్తించేవాడు . గురువు గారికి ప్రియ శిష్యుడుగా మారినాడు . గురువు గారు కూడా కచుని ప్రవర్తనను గమనించేవారు . బృహస్పతి కుమారుడవడం చిన్న తనము నుండి వేదాధ్యయనము చేయడము, ఆశ్రమము వాతావరణము లో పెరగడం మరియు సాదు స్వభావము కలిగి ఉండుటచే మిగతా రాక్షస బాలుర కంటే భిన్నంగా కన్పించేవాడు.

గురూగారికి పూజాది కార్యక్రమాలకు కావలసిన సామగ్రి నంతటిని సమకూర్చడం , సపర్యలు చేస్తూ అత్యంత ప్రియశిష్యుడు గా తయారయ్యాడు . శుక్రాచార్యునికి  ఒక కుమార్తె ఉన్నది . ఆమె పేరు దేవయాణి . ఇంచు మించు ఇద్దరూ సమ వయస్కులు . కచుడు మరియు దేవయాని ఇద్దరూ ఒకరి నొకరు ఇష్ట పడేవారు . కొన్నాళ్ళకు ఇష్టం ప్రేమగా మారింది .

ఇదిలా ఉండగా గురువుగారు తమకన్నా కచుని పై ఎక్కువ ప్రేమాభిమానములు చూపిస్తున్నారని మిగతా రాక్షస బాలురకు రోజు రోజుకు ఈర్ష్య  , అసూయలు పెరిగి పోసాగాయి.కచుని ఎలాగైనా హతమార్చాలని అదను కోసం ఎదురు చూస్తున్నారు .
ఒకరోజు వేకువనే లేచిన కచుడు పూజకు కావలసిన పువ్వులు , పండ్లు మొదలగునవి తేవడం కోసం అడవికి బయలు దేరాడు .ఇది గమనించిన రాక్షసులు కచుని వెంబడించి అడవిలో కొంత దూరములో అతనిని చెట్టుకుఉరివేసి చంపేశారు .తెల్లవారిన తరువాత చాలా సమయము వరకు కచుడు కనిపించ లేదనీ దేవయాని దిగాలుగా కూర్చొని ఉన్నది .
కుమార్తె విచారముగా కూర్చొని ఉండడం చూసిన శుక్రాచార్యుడు దేవయానిని అడిగాడు . ఏమమ్మా విచారముగా ఉన్నావని . కచుడు వేకువన అడవికి వెళ్ళినాడని ఇంతవరకు ఇంటికి చేరలేదనీ తండ్రితో చెప్పింది .
అంతట శుక్రాచార్యుడు దివ్యదృష్టి తో పరిసీలించాడు. చెట్టుకు ఉరితో వ్రేలాడుచున్నకచుని చూశాడు . వెంటనే మృత సంజీవనీ మంత్రమును ప్రయోగించి కచుని సజీవుని చేసాడు .

రాక్షసులకు కోపం తగ్గలేదు .ఎలాగైనా కచుని అడ్డు తొలగించు కోవాలని అనుకొన్నారు . మరికొన్నాళ్లకు అవకాశము చిక్కింది . శుక్రాచార్యునికి మద్యాన్ని సేవించే అలవాటు ఉండేది .రాక్షస కుమారులు ప్రతి రోజు కుండ నిండా కల్లు తెచ్చి గురువుగారికి ఇచ్చేవారుకచుడుని చంపి దహనము చేసి బూడిదను కుండలో ఉన్న కల్లులో కలిపి గురువుగారి ఇంటిదగ్గర  ఇచ్చేసారు . గురువు గారు యధావిధిగా కల్లు ను త్రాగేసారు .
కచుడు ఎంత సేపటికి ఇంటికి రాకపోవుట వలన దేవయాని విచార వదనము తో ఉన్నది . ఇది గమనించిన శుక్రాచార్యుల వారు దివ్య దృష్టితో గమనిచాడు . కచుడు బూడిద రూపములో తన గర్భములో ఉన్నాడని తెలుసుకొని అవాక్కయాడు . అలోచించి తన తపోబలముచే గర్భములో బూడిద రూపములో ఉన్న కచుని మానవ రూపములోకి మార్చాడు . యోగ ప్రభావము వలన కచునికి మృత సంజీవనీ మంత్రం ను బోధించాడు . అంతట కచుడు శుక్రుని గర్భమును చీల్చుకొని బయటకు వచ్చి చచ్చి పడియున్న గురువు గారిని బ్రతికించాడు .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...