శుక్రుని గురించి ఒక విశిష్టమైన కధ
ఉన్నది .
ఈయన మద్యపాన ప్రియుడు , కోపిష్టి . ముందు
వెనుకలు ఆలోచించ కుండా ప్రవర్తించే లక్షణములు కలవాడు .
దేవతలకు గురువు బృహస్పతి . రాక్షసులకు
గురువు శుక్రాచార్యుడు . దేవతలు ,రాక్షసులు కలసి క్షీర సాగరమును మదించి నపుడు మొదట
కాల కూట విషం పుట్టింది .
ఈ విష ప్రభావమును ఎవరూ తట్టుకోలేక పోయారు . అపుడు అందరూ
అలోచించి కాల కూట విష ప్రభావమును తట్టుకొనే శక్తి ఈశ్వరునికి తప్ప మరెవరికి లేదనీ
. పరమేశ్వరుని ప్రార్ధించారు . అంతట ఆదిదేవుడైన శివుడు ప్రత్యక్ష్యమై కాలకూట
విషమును స్వ్వీకరించాడు . విష ప్రభావము వలన పరమేశ్వరుని గొంతు నీలముగా
మారింది . అందుకే శివునకు నీలకంటుడు అని
పేరు వచ్చింది .
తరువాత పాల సముద్రం నుండి అమృతము పుట్టింది
. ఈ అమృతమును పంచుకొనే సమయములో దేవ , దానవులుకు యుద్ధం జరిగింది . బృహస్పతి
దేవతలకు , శుక్రాచార్యుడు రాక్షసులకు యుద్ధము నందు మెలకువలను తెలియ పరస్తూ తమ తమ
శిష్యులకు యుద్ధ నైపుణ్యములను నేర్పుచూ మానిటర్ చేస్తూన్నారు .
శుక్రాచార్యునికి ‘’ మృత సంజీవనీ విద్య తెలుసు’’ ఈ మృత సంజీవనీ
విద్యను ఉపయోగించి మంత్ర ప్రభావముచే యుద్ధము నందు చనిపోయిన తన శిష్య గణమైన
రాక్షసులకు ప్రాణం పోసి తిరిగి బ్రతికించు చున్నాడు . దీని వలన రాక్షసుల
సంఖ్యఅలాగే ఉంది కానీ దేవతలు నానాటికీ తరిగి పోతున్నారు .
దీనికి ప్రత్యామ్నాయము ఏమిటి అని దేవతలందరూ
ఆలోచించ సాగారు . దేవ గురువు అయిన బృహస్పతికి మృత సంజీవినీ విద్య తెలియదు . మరి
ఎలా అని ఆలోచించగా ఒక ఉపాయము తట్టింది .
దేవతలలో ఒకరు ఈ విద్యను నీర్చుకోవాలని
నిర్ణయించుకొన్నారు . దానికి సమర్ధుడైన వారు ఎవరున్నారని అని వెతకగా యువకుడు ,
బుద్దిమంతుడు , జ్ఞాని , ఏక సంధాగ్రాహుడు అయిన బృహస్పతి కుమారుడు కచుడు గుర్తుకు
వచ్చాడు .
వెంటనే కచుని శుక్రుని వద్ద శిష్యునిగా
చేర్పించేందుకు సిద్ధ పడ్డారు .
మిగతాది తరువాత శీర్షికలో
....................
No comments:
Post a Comment