2013-06-30

శుక్రాచార్యుడు .. 1



శుక్రుని గురించి ఒక విశిష్టమైన కధ ఉన్నది . 

ఈయన మద్యపాన ప్రియుడు , కోపిష్టి . ముందు వెనుకలు ఆలోచించ కుండా ప్రవర్తించే లక్షణములు కలవాడు .
దేవతలకు గురువు బృహస్పతి . రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు . దేవతలు ,రాక్షసులు కలసి క్షీర సాగరమును మదించి నపుడు మొదట కాల కూట విషం పుట్టింది .

 ఈ విష ప్రభావమును ఎవరూ తట్టుకోలేక పోయారు . అపుడు అందరూ అలోచించి కాల కూట విష ప్రభావమును తట్టుకొనే శక్తి ఈశ్వరునికి తప్ప మరెవరికి లేదనీ . పరమేశ్వరుని ప్రార్ధించారు . అంతట ఆదిదేవుడైన శివుడు ప్రత్యక్ష్యమై కాలకూట విషమును స్వ్వీకరించాడు . విష ప్రభావము వలన పరమేశ్వరుని గొంతు నీలముగా మారింది  . అందుకే శివునకు నీలకంటుడు అని పేరు వచ్చింది .

తరువాత పాల సముద్రం నుండి అమృతము పుట్టింది . ఈ అమృతమును పంచుకొనే సమయములో దేవ , దానవులుకు యుద్ధం జరిగింది . బృహస్పతి దేవతలకు , శుక్రాచార్యుడు రాక్షసులకు యుద్ధము నందు మెలకువలను తెలియ పరస్తూ తమ తమ శిష్యులకు యుద్ధ నైపుణ్యములను నేర్పుచూ మానిటర్ చేస్తూన్నారు .

శుక్రాచార్యునికి ‘’ మృత సంజీవనీ విద్య తెలుసు’’ ఈ మృత సంజీవనీ విద్యను ఉపయోగించి మంత్ర ప్రభావముచే యుద్ధము నందు చనిపోయిన తన శిష్య గణమైన రాక్షసులకు ప్రాణం పోసి తిరిగి బ్రతికించు చున్నాడు . దీని వలన రాక్షసుల సంఖ్యఅలాగే ఉంది కానీ దేవతలు నానాటికీ తరిగి పోతున్నారు .

దీనికి ప్రత్యామ్నాయము ఏమిటి అని దేవతలందరూ ఆలోచించ సాగారు . దేవ గురువు అయిన బృహస్పతికి మృత సంజీవినీ విద్య తెలియదు . మరి ఎలా అని ఆలోచించగా ఒక ఉపాయము తట్టింది .

దేవతలలో ఒకరు ఈ విద్యను నీర్చుకోవాలని నిర్ణయించుకొన్నారు . దానికి సమర్ధుడైన వారు ఎవరున్నారని అని వెతకగా యువకుడు , బుద్దిమంతుడు , జ్ఞాని , ఏక సంధాగ్రాహుడు అయిన బృహస్పతి కుమారుడు కచుడు గుర్తుకు వచ్చాడు .

వెంటనే కచుని శుక్రుని వద్ద శిష్యునిగా చేర్పించేందుకు సిద్ధ పడ్డారు .
మిగతాది తరువాత శీర్షికలో ....................

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...