మన పురాణములలో స్త్రీ ని గురించి ఈ విధముగా
ఉన్నది .
కార్యేషు దాసీ
కరణేసు మంత్రి భోజ్యేషు మాతా శయనేసు రంభా
రూపేషు లక్ష్మీ
క్షమయా ధరిత్రీ షట్ ధర్మవర్తీ కుల ధర్మ పత్నీ:
అనగా స్త్రీ చేయు కార్యములయందు సహనముతో దాసీ వలె
ఉండాలి . రాజుకు మంత్రి ఏవిధముగా సలహాలిచ్చి సహాయపడతాడో అదే విధముగా ఆర్ధిక
విషయములలోగానీ , కుటుంబ విషయములలో గానీ , పిల్లల యొక్క భవిష్యత్తు ను గురించి గానీ
మంచి సలహాలనిచ్చి భర్తకు తోడ్పాటు
నందించాలి . భోజన విషయములో ఒకతల్లి తన పిల్లలను ఏ విధముగా చూసుకుంటుందో భర్తను అలా
చూసుకోవాలి .
పడక సౌఖ్యమును అందించునపుడు రంభ వలె శృంగారముగా ఉండాలి. రూపములో
లక్ష్మి దేవివలె ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి . భూదేవి వలె ఓపిక కలిగి ఎంతటి క్లిష్టపరిస్థితుల నైనా
ఎదుర్కొనే ఓపిక ఉండాలి . {ఈ శ్లోకములో
చెప్పిన కులము అను పదము వంశము అని అర్ధము చేసుకోవాలి }ఇలా ఆరు గుణములు కలిగిన
స్త్రీ అడుగు పెట్టిన మెట్టినింటికి, వంశమునకు పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు
పెరుగుతాయి ..
ఈ పైన
ఉదాహరించిన శ్లోకములో స్త్రీని దాసిగా , సేవలు చేసేదిగా చెప్పడం జరిగింది . సోదరీ
మణులు తప్పుగా అర్ధం చేసుకోవద్దని మనవి .
ఆనాటి కాలములో కుటుంబ పోషణ మొత్తం పురుషుడు
చూసుకొనేవాడు . ఇంటి భాద్యతలు స్త్రీలు చూసుకొనేవారు.
ఈనాడు మన సోదరీమణులు సమాన హక్కుల గురించి
పోరాడుచున్నారు. అంతే కాకుండా భార్య భర్త ఇరువురు కష్టపడితే గానీ బ్రతకడం కష్టమైన
ఈ రోజులలో స్త్రీ పురుషులంతా సమానమే . ఈ నాటి స్త్రీలు పురుషులతో సమానముగా చదువు
కొను చున్నారు . ఉద్యోగ వ్యాపార వ్యవహారములలో పోటీ పడుచున్నారు .
అలాగే పురుషుడు ‘’
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ’’
అని అగ్ని సాక్షిగా ప్రమాణము చేసి పెళ్ళాడిన భార్యకు శ్రీరాముని వలె ఏక
పత్నీవ్రతుడై , ధర్మ బద్దుడై , శాంత చిత్తుడై భార్యను అర్ధం చేసుకొని నడచుకోవాలి .
ఇరువురి మధ్య అరమరికలు ఉండకూడదు . కష్ట సుఖములలో ఐశ్వర్యము ఉన్న , పేదరికము ఉన్న ఒకరి
పట్ల ఒకరు విధేయత కలిగి ప్రవర్తించుట వలన సంసారము ఏ సమస్యలు లేకుండా హాయిగా
సాగిపోతుంది .
No comments:
Post a Comment