పిల్లలు
పుట్టినప్పుడు నక్షత్రము మంచిదేనా ? దోషములేమైనా ఉన్నాయా ? శాంతి అవసరమా ? అను
సందేహము ప్రతి తల్లిదండ్రులకు కలుగుతుంది . ఏ నక్షత్రములలో జన్మించినపుడు ఏ
దోషములు కలుగు తాయి దోష పరిహారములు ఏమిటి ? అను విషయమును గురించి ఈ శీర్షికలో
తెలుసు కుందాం .
దోష
నక్షత్రములలో జన్మించిన పిల్లలకు నక్షత్ర జపము , నవ గ్రహ శాంతి ,హోమము , నూనెలో
నీడలు చూచుట , రుద్రాభిషెకము, మొదలగు శాంతిని తప్పని సరిగా జరిపించాలి . కొన్ని
విశేష శాంతి కలిగిన నక్షత్రములకు శాస్త్రోక్తముగా విశేష శాంతి చేయాలి .  
1.      
అశ్విని 1 వ పాదములో జన్మంచిన పిల్లల వలన
తండ్రికి గండము . ఈ దోషము ౩ నెలలు ఉండును. బంగారము దానము చెయ్యడము వలన నివృత్తి
కలుగును . ఇక్కడ గమనించ వలసిన విషయము రేవతి , అశ్విని నక్షత్రముల మధ్య సుమారు 48 నిమిషములు
సంధి కాలము ఉంటుంది . ఈ సంధి సమయములో జన్మించిన శిశువుకు ఆయుర్దాయము తక్కువగా
ఉంటుంది . అశ్విని 2 ౩ 4 పాదములలో జన్మించిన వారికి దోషములేదు .
2.      
భరణీ 1 2 4 పాదములలో జన్మంచిన వారికి దోషములేదు .
౩ వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి , మగపిల్ల పుడితే తండ్రికి గండము కలుగును . ఈ
దోషము 23 దినముల వరకు ఉంటుంది .
3.      
కృత్తిక నక్షత్రములో ౩ వ పాదము లో జన్మంచిన
స్త్రీ తల్లికి పురుషుడు తండ్రికి అరిష్టమును కలుగ చేయును . 1 2 4 పాదములలో
జన్మంచిన వారు స్వల్ప దోషమును కలుగ చేయుదురు .
4.      
రోహిణి నక్షత్రము 1 వ పాదములో జన్మించిన మేనమామకు
, 2 వ పాదము తండ్రికి , ౩వ పాదము తల్లికి దోషమని 4 వ పాదము దోషము లేదని కొందరి
అభిప్రాయము . సామాన్యముగా ఈ నక్షత్రములో పుట్టిన వలన మేనమామ కు గండము. తప్పక శాంతి
అవసరము . శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈ నక్షత్రము నందే జన్మించాడు. మేనమామ గండములో
పుట్టాడు .  అందు వలెనే కంసుడు
నాశనమయ్యాడనీ పురాణ వచనము .
5.      
మృగశిర 1 2 ౩ 4 పాదములలో జన్మించిన వారికి ఏ
విధమైన దోషములు ఉండవు .
6.      
ఆరుద్ర నక్షత్రము 1 2 ౩ పాదము లలో జన్మంచిన
వారికి దోషము లేదు 4 వ పాదమున జననము జరిగిన సామాన్య శాంతి అవసరము 
7.      
పునర్వసు నక్షత్రము 1 2 ౩ 4  పాదములు అన్నీ మంచివే . ఏ విధమైన శాంతి అవసరము
లేదు .
8.      
పుష్యమి నక్షత్రము కర్కాటక లగ్నములో పగటి సమయమున
పురుషుడు పుట్టిన తండ్రికి గండము కలుగును . రాత్రి సమయాన స్త్రీ జన్మించినచో
తల్లికి గండము కలుగును.   పుష్యమి నక్షత్రము లో జన్మించిన వారివలన 1 వ
పాదము మేనమామలకు 2 ౩ పాదములలో తల్లి తండ్రులకు దోషము కలిగింతురు . నాలగవ పాదమున
పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును . వీరికి శాస్త్రోక్తముగా శాంతిని చేయించాలి
. గంధపు చెక్కను దానము ఇచ్చుట వలన దోషము నశించును . 
9.      
ఆశ్లేష నక్షత్రములో 1 వ పాదమున  పుట్టినవారికి 
దోషము లేదు.  2 వ పాదము శిశువునకు ౩
వ పాదము తల్లికి 4 వ పాదము తండ్రికి దోషము . నాలుగవ పాదము న జన్మించిన వారికి
విశేష శాంతి చేయించుట అవసరము. ఈ నక్షత్రము యొక్క చివరన 24 నిమిషములు సంధి ఉండును .
ఈ సంధి కాలమున జన్మించిన శిశువునకు పూర్ణాయుర్ధాయము ఉండదు . 
No comments:
Post a Comment