జ్యోతిష్య శాస్త్రములో గ్రహముల ను గురించి
వివరిస్తూ గ్రహముల కు జాతులను నిర్ణయించినారు . జాతులు అనగా కులాలు అని తెలుసు
కోవలసిన అవసరము ఉన్నది . అయితే కులముల ప్రస్తావన ఏమిటి ? కులములు ఎందుకు
ఏర్పడ్డాయి ? . గ్రహముల కు , జాతులకు సంబంధం ఏమిటి . అని చాలా లోతుగా అధ్యయనము
చేయవలసిన అవసరము ఎంతైనా ఉన్నది .
జ్యోతిష్య శాస్త్రములో సూచించిన జాతులు 5
బ్రాహ్మణులు , క్షత్రియులు , వైశ్యులు , శూద్రులు
, మ్లేచ్చులు అని అయిదు రకములుగా విభజించారు.
.
జ్యోతిష్య శాస్త్రము మొత్తం విశ్వం గురించి , ఈ
ప్రపంచములో భూమిపై జన్మించిన మానవులందరి గురించి భూత, భవిష్యత్ , వర్తమాన
విషయములను తెలుసు కొనుటకు కనుగొన బడినది .
కుల వ్యవస్థ ఉన్న భారత దేశములో ఆనాటి
పరిస్థితులను ఉద్దేశించి అలా చెప్పి ఉంటారు . కానీ ఇతర దేశాలలో అనగా కుల వ్యవస్థ
లేని దేశాలలో ఉన్నవారికి ఎలా ఫలిత నిర్ధారణ చేయగలము . ఇప్పుడు ఉన్న కులములకు
జ్యోతిష్య శాస్త్రములో చెప్పబడిన కులములకు సంబంధం కుదురుట లేదు . .
పూర్వకాలములో ముఖ్యముగా మన భారత దేశములో రాజుల
పరిపాలన ఉండేది . ఈ భారత దేశములో అనేక చిన్న చిన్న సామంత రాజ్యములను రాజులు
పరిపాలించేవారు. పరిపాలకులను క్షత్రియులు గా భావించాలి .
రాజుగారు ప్రభుత్వమును నడుపుటకు సలహాలు సూచనలు
ఇవ్వడము , క్లిష్ట సమయములలో సరియైన నిర్ణయములు చేయడం , రాజ్యములో సిద్దాంతములను ,
రాచరికపు వ్యవస్థలను కాపాడే వారిని , కొత్త కొత్త పరిశోధనలు చేసి మానవ అభివృద్దికి
తోడ్పాటు నందించే మేధావులను బ్రాహ్మణులు
గా భావించాలి.
ప్రజలకు కావలసిన వస్తు సామగ్రిని , సరఫరా చేస్తూ
వ్యాపారము, వర్తక వాణిజ్యము చేయు వారిని వైశ్యులుగా భావించాలి .
శారీరక శ్రమ కోర్చి ,కష్ట పడే కష్ట జీవులను
శూద్రులుగా భావించవలసి ఉంటుంది .
ఇక సంఘ వ్రతిరేక కార్యకలాపము లకు పాల్పడడం ,
ప్రజా వ్యతిరేక విధానములో ఉన్నవారిని మ్లేచ్చ జాతికి చెందినవారిగా గుర్తించాలి .
అంతేగానీ ఇప్పుడుమన ఆచారములో ఉన్న బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర ,
మ్లేచ్చ జాతులు కాదు అని మనమందరము తెలుసుకోవాలి .
ఎందుకంటే ఇప్పుడు ప్రపంచము లోనే అగ్రరాజ్యము
అమెరికాను పరిపాలిస్తున్న బరాక్ ఒబామా
క్షతియుడు కాదు కదా. భారత దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు క్షత్రియుడు కాదు
కదా . ప్రపంచములో ఉన్న దేశ అధినేతలలో ఎందరు క్షత్రియులు ఉన్నారు ?.
షేర్ మార్కెట్ మాంత్రికుడు గా పేరు గాంచిన వారెన్
బఫెట్ , రాకేశ్ జంజిన్వాలా లాంటి అపర చాణుక్యులు, వ్యాపార సామ్రాజ్యాలకు అధిపతులు
అయిన బిల్ గేట్స్ , ధీరూభాయ్ అంబానీ , ముఖేష్ అంబానీ , అనిల్ అంబానీ , ఇన్ఫోసిస్
వ్యవస్థాపకులు నారాయణ మూర్తి , విప్రో అధినేత అజీం ప్రేమ్ జీ వంటి వ్యాపార
దిగ్గజాలలో ఎంతమంది వైశ్యజాతి వారున్నారు .
దీనిని బట్టి మనము ఏమని గ్రహించాలి . గ్రహముల కు
చెప్పబడిన జాతులు లక్షణములు తెలుసుకొనుటకే గానీ ఇప్పుడున్న కులములకు సంబంధించినవి
కావని గ్రహించాలి .
ఈనాడు రాజరికపు వ్యవస్థలు పోయాయి .. ప్రజాస్వామ్య
వ్యవస్థలు వచ్చాయి .
వ్యవస్థలు మారవచ్చు . కులాలు మారవచ్చు . కానీ
గ్రహాలు శాశ్వతం , భూమి, ఆకాశము శాశ్వతం . పంచ భూతములు శాశ్వతం . అందువలన
మహర్షులు చెప్పిన ఏ విషయము అసత్యము కాదు . శాస్త్రములను శోధించి, మదించి మానవాళి అభివృద్ధి
కొరకు మానవ పురోగతి కొరకు ఎన్నో పరిశోధనలను చేయాల్సిన అవసరం ఉంది .
మరింత వివరణ తదుపరి శీర్షికలో
.....................
No comments:
Post a Comment