ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
వినాయక వ్రతము – పూజా సామాగ్రి
మట్టి వినాయక విగ్రహం , పసుపు , కుంకుమ , అక్షతలు
, గంధం , గుగ్గిలం ,కలశము ,గంట , ఆచమన పాత్రలు 2 , ఉద్ధరిణిలు 2 , అగరబత్తీ పేకెట్ , కర్పూరం పేకెట్ ,
కొబ్బరికాయలు , అరటిపండ్లు , తమలపాకులు , వక్కలు , పళ్ళాలు 2 , దీపారాధనకు వస్తువులు
, జంధ్యాలు 2 , పంచామృతం , పీటలు .
నైవేద్యము : ఉండ్రాళ్ళు , అప్పాలు , పరమాన్నం ,
కుడుములు , అటుకులు, బెల్లం , నానుబ్రోలు
, చలిమిడి , సీతాఫలం పండ్లు , చెరకు గడలు , మొక్క జొన్న పొట్టలు ,
పువ్వులు మరియు పత్రులు : నాలుగు లేక ఐదు రకముల
పండ్లు , చామంతి , గన్నేరు , తంగేడు, తెల్ల జిల్లేడు మొదలగు పువ్వులు , మామిడి కొమ్మలు , మామిడి ఆకులు , మారేడు ,
నేరేడు , జమ్మి ,జిల్లేడు , గరిక , తంగేడు , మొదలగు పత్రులు ఇవన్నీ సిద్దం చేసుకోవాలి .
పూజ
చేయవలసిన విధి
వినాయక చవితి రోజు వేకువ జామున లేచి కుటుంబ
సభ్యులందరూ తలంటుస్నానం చేయాలి . ఇల్లంతా శుభ్రం చేయాలి . పైన తెలిపిన పూజా
సామగ్రి సిద్దం చేసుకోవాలి . మీ గృహములో పూజగదిలో గానీ పూజ గది లేనివారు ఈశాన్య
దిశలో గానీ స్థలాన్ని శుద్దిచేయాలి . బియ్యపు పిండి , ముగ్గు పిండితో లేక రంగులతో
ముగ్గు వేయాలి .
పిమ్మట గణపతిని ప్రతిష్టించుట కొరకు ఒక పీటను
సిద్దంచేయాలి . ఆ పీటకు పసుపురాసి , కుంకుమ బొట్లు పెట్టి అందమైన ముగ్గు వేయాలి .
ఆ పీటపై ముందుగా సిద్దం చేసుకొన్న గణపతి విగ్రహాన్ని ఉంచాలి .
తరువాత కుంటుంబ సభ్యులందరూ బొట్టు పెట్టు కోవాలి
.
పూజ చేసేవారు కూర్చునేందుకు మరొక పీటను సిద్దం
చేసుకోవాలి . పీటపై తెల్లని వస్త్రమును పరచి అక్షతలు వేయాలి. తాంబూలం కుడి చేతితో
పట్టుకొని ఈ విధంగా చదువుతూ పీటపై కూర్చోవాలి .
శ్లోకం :
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న
వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే .
పీటపై కూర్చున్న తరువాత మొదటగా తమల పాకును
తీసుకొని గణపతి దగ్గర ఉంచాలి . కొంచెం పసుపు పొడిని తీసుకొని నీటితో తడిపి పసుపు
గణపతి గా చేయాలి . కుంకుమ బొట్లు పెట్టి తమల పాకు పై ఉంచాలి .
ప్రార్ధన
సుముఖశ్చైక
దంతశ్చ కపిలో గజ కర్ణకః
లంబోదరశ్చ
వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమ కేతు ర్గణాధ్యక్షః
ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్ప
కర్ణో , హేరంబః స్కంద పూర్వజ:
ఈ పూజా విధానము
పూర్తిగా చూడాలంటే వినాయక
వ్రతం పేజీ లో
చూడవచ్చు
No comments:
Post a Comment