వినాయక వ్రత కధ కావలసిన వారు ఈ దిగువ లింక్ ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు .
www.scribd.com/doc/166247538/వినాయక-వ్రత-కధ
www.scribd.com/doc/166247538/వినాయక-వ్రత-కధ
సూత
మహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పినాడు . పూర్వకాలములో ఏనుగు ముఖము కలిగిన రాక్షసుడు
( గజాసురుడు ) శివుని కొరకు తపస్సు చేసాడు . బోళా శంకరుడైన పరమేశ్వరుడు అతని
తపోదీక్షకు మెచ్చి ప్రత్యక్ష మయ్యాడు . అతనిని వరము కోరుకొమ్మని అడిగాడు . అంతట ఆ
రాక్షసుడు తనకు ఎవరి చేత మరణము లేకుండు
నట్లు , అనంత శక్తి సామర్ధ్యములను ప్రసాదించమని , మరియు పరమేశ్వరుడు తన గర్భములో
ఉండాలని వరము కోరుకున్నాడు . ఆతనికి ఇచ్చిన మాట ప్రకారము శివుడు వరముల ప్రసాదించి
గజాసురుని గర్భములో ప్రవేశించినాడు .
ఈ
విషయమును తెలుసుకున్న పార్వతీ దేవి తన భర్తను గురించి చింతించ సాగింది . కైలాసము
బోసిపోయింది . జగన్మాత పార్వతీ దేవి భర్త పరమేశ్వరుని విడిపించి తెచ్చుటకు ఉపాయము
ఆలోచించిది . వెంటనే విష్ణువు సహాయము కోరింది . అంతట విష్ణు మూర్తి ఒక పధకము
వేసాడు . విష్ణువు గంగిరెడ్ల వాని వలె వేషధారణ గావించాడు . శివుని వాహనము
నందీశ్వరుని గంగిరెద్దు లా అలంకరించారు .
పిమ్మట గజాసురుని రాజ్యమునకు వెళ్లి
అక్కడ గంగిరెద్దు తో నాట్యము చేయించడం మొదలు పెట్టాడు . ఈ విషయము తెలుసుకొన్న
గజాసురుడు గంగిరెద్దు మేళం వారిని తన ఆస్థానమునకు పిలిపించాడు . గజాసురుని సన్నిధిలో
విష్ణువు గంగిరెద్దు తో అనేక విధముల నాట్యములను చేయించాడు . ఆ నాట్యమును తిలకించిన
గజాసురుడు మంత్రం ముగ్ధుడై కావలసిన వరము కోరుకో అన్నాడు . అంతట విష్ణువు ఇచ్చిన
మాట తప్పకుండా నేను కోరిన వరములు ఇయ్యాలి అన్నాడు . అందుకు గజాసురుడు సరేనన్నాడు .
నీ
గర్భములో ఉన్న పరమేశ్వరుని విడచి పెట్ట మన్నాడు . విషయమును గ్రహించిన గజాసురుడు
ఇచ్చిన మాట ప్రకారము శివుని విడిచి పెట్టుటకు అంగీకరించాడు . అంతట నందీశ్వరుడు
వాడియైన తన కొమ్ములతో గజాసురుని కడుపులో పొడిచి ఈశ్వరుని విడిపించాడు . గర్భము
చీలిఉన్న గజాసురుడు ఉత్తర దిశగా పడిపోయాడు . ఆఖరిగా గజాసురుడు శివుని ఒక వరం
కోరాడు .. నేను ఇచ్చిన మాట ప్రకారము మిమ్ములను విడచి పెట్టాను . నాకు మీ సన్నిధిలో
స్థానం ఇవ్వండి అన్నాడు . నాకు ముల్లోకములలో పూజలందు కొను భాగ్యమును ప్రసాదించండి
. అందుకు పరమేశ్వరుడు సరే అన్నాడు .
శివుడు
గజాసురుని గర్భము ఉండి విముక్తుడైనాడని తెలుసు కొన్న పార్వతీ దేవి ఎంతో సంతోషముతో
ఉన్నది . తన భర్తకు స్వాగతము పలుకుటకై సిద్ధ మగుచున్నది .అభ్యంగన స్నానము
ఆచరించుటకై నలుగు పిండిని సిద్ధం చేసుకుంది . భర్త రాకకై ఎదురు చూస్తూ పర
ధ్యానముతో నలుగు పిండి తో ఒక బాలుని బొమ్మను తయారు చేసింది . ఆ బొమ్మకు ప్రాణ
ప్రతిష్ట చేసింది . ముగ్ధ మనోహర రూపము కలవాడై చూచుటకు చాలా అందముగా కనిపించు
చున్నాడు . ఆ బాలునకు ఉండ్రాళ్ళు మొదలగు
తిను బందారములను ఇచ్చినది . ద్వారము వద్ద కాపలా ఉంచి తన పనులకై ఇంటి లోపల ఉన్నది .
పరమేశ్వరుడు
ఇంటికి వచ్చాడు .ద్వారము వద్ద ఉన్న బాలుడు లోనికి వెళ్ళకుండా అడ్డుపడ్డాడు .
ఇద్దరి మధ్య వాదోప వాదములు జరిగాయి . చివరకు పరమేశ్వరుడు కోపోద్రిక్తుడై తన
వద్దనున్న త్రిశూలముతో బాలుని శిరసు ఖండించాడు . జరిగిన విషయమును తెలుకొన్న పార్వతి
బోరున విలపించింది . బాలుని మరణమును తట్టుకోలేక పోయింది . ఇది గమనించిన బ్రహ్మ ,
విష్ణువులు కైలాసమునకు వచ్చినారు. పార్వతిని శాంతించ మణి చెప్పి ఈ బాలునికి ప్రాణ
ప్రతిష్ట చేస్తామని చెప్పి ఊరడించినారు.
అయితే ఈ బాలుని మొండెమునకు అతికించుటకు శిరస్సు
కావాలి . ఎలా ఆలోచించ సాగారు. అప్పుడు పరమేశ్వరుడు గజాసురునికి ఇచ్చిన వారము గుర్తుకు
వచ్చింది . ఉత్తర దిశలో చచ్చి పడి వున్న దేహము యొక్క శిరస్సును తెమ్మని ఈశ్వరుడు
తన భటులకు ఆజ్ఞాపించాడు .
భటులు
గజాసురుని శిరస్సును తెచ్చారు . ఏనుగు ముఖము ను చూసిన పార్వతి ఎంతో అందముతో ఉన్న
నా కుమారుడు ఇన్నత వికార రూపముతో ఉంటాడా అని అందుకు సమ్మతించలేదు . అంతట బ్రహ్మ
విష్ణువు మొదలగు వారందరూ పార్వతిని వారించి అందము లేక పోయిన నీ కొడుకు ముక్కోటి
దేవతలకు ఆరాధ్యుడు అవుతాడు . అపార మేధా సంపత్తి ఇతనికి కలుగుతుంది . విద్యా వినయ
సంపన్నుడు . అనంత శక్తి స్వరూపుడు . అవుతాడు . అని పార్వతికి నచ్చ చెప్పారు .
పిమ్మట గజముఖమును బాలుని మొండెమునకు అతికించి బ్రహ్మ దేవుడు ప్రాణ ప్రతిష్ట చేశాడు
. ఆ బాలుడే గజాననుడు అయ్యాడు .శివ పార్వతుల ముద్దుల కుమారుడయ్యాడు .అనింద్యుడు అను
మూషిక రాజమును వాహనముగా చేసుకొన్నాడు .విఘ్నములకు
అధిపతిగా గజాననుని నియమించాలని పరమేశ్వరుడు
నిర్ణయించాడు
ఆ ఆధిపత్యము తనకే ఇవ్వాలని
శివుని రెండవ కుమారుడు కుమారా స్వామి కోరినాడు . అందుకు పరమేశ్వరుడు గజాననుడు కి
కుమారస్వామి కి పోటీ పెట్టాడు . మీ ఇద్దరిలో ముందుగా ఎవరు ముల్లోకములను అందున్న
పవిత్రమైన నదులయందు స్నానమాచరించి ముందుగా వస్తారో వారికే ఈ పదవి దక్కుతుందని
చెప్పాడు . అందుకు సమ్మతించి కుమారస్వామి తన నెమలి వాహనమును వేసుకొని బయలు దేరాడు
.
అంతట
గజాననుడు ఖిన్నుడై తండ్రీ నా ఈ భారీ రూపముతో నేనీ పరీక్షను గెలవా గలనా. నా శక్తి
కి మించిన పరీక్ష పెట్టితిరి అని అనుకోని దీర్ఘముగా ఆలోచించి ఉపాయమును తెలుసు
కొన్నాడు .
నారాయణ మంత్రమును స్తుతించి . తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి
చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేశాడు . ఈ ప్రభావము వలన నదుల వద్దకు స్నానమాచరించుటకు
వెళ్ళుచున్న కుమారస్వామికి గజాననుడు ప్రత్యక్షము అగు చున్నాడు . కుమారస్వామి
తిరిగి కైలాసమునకు చేరే టప్పటికి గజాననుని దర్శించి , ఆతని బుద్ది సూక్ష్మతను,
జ్ఞానాన్ని , తెలివి తేటలను చూసి విఘ్నాదిపత్యము గజాననునికి ఇవ్వాలని కోరాడు ఆ
విధముగా విఘ్నాధిపత్యము పొందుట వలన గజాననునికి విఘ్నేశ్వరుడుగా , విఘ్నములకు
నాయకుడు కాబట్టి వినాయకుడుగా పేరు వచ్చింది . ఇది బాద్రపద శుద్ధ చవితి నాడు
జరిగింది . కావున ప్రతి సంవత్సరము బాద్రపద శుద్ధ చవితి ని వినాయక చవితి గా చెప్పడం
జరిగింది .
విఘ్నములకు
అధిపతి యైన సందర్భముగా ఆ రోజు ముక్కోటి దేవతలు , సమస్త లోకములలో ఉన్న ప్రజలు అందరూ
వినాయక చవితి పండగ జరుపుకొన్నారు .. పండగలో అందరూ బహూకరించిన పిండి వంటలు
మున్నగునవి వినాయకుడు తనివితీరా ఆరగించాడు . పెద్దబొజ్జ వచ్చింది .పండగ హడావడి తరువాత
వినాయకుడు తల్లి దండ్రుల వద్దకు వెళ్లి
నమస్కారము చేయబోయి తలక్రిందులుగా పడిపోయాడు .అది చూసి శివుని శిరస్సున ఉన్న
చంద్రుడు నవ్వాడు . చంద్రుడు నవ్వడం గమనించిన పార్వతి తన కుమారుని అపహాస్యం
చేసినాడు . కనుక చంద్రుని ముఖము చూసిన వారికి పాపములు తగులుతాయి . నీ ముఖము ఎవ్వరూ
చూడకుండు గాక అని శపించింది .
అప్పుడు
ముక్కోటి దేవతలు మునులు సాధుపుంగవులు అందరూ కూడా దేవ దేవుని ప్రార్దిన్చినారు .
చంద్రుని చూడకుండా లోకములోని జనులు ఎలా ఉంటారు . దీనికి ఉపాయమును చెప్పుమని
ప్రార్దిన్చినారు .
అంతట పరమేశ్వరుడు బాద్రపద శుద్ధ
చవితి నాడు గణేశుని పూజించి , వినాయక వ్రతం ఆచరించి కధను చెప్పుకున్నవారికి ,
విన్నవారికి , పూజాక్షతలు శిరస్సున ధరించిన వారికినీలాప నిందలురావు అని చెప్పాడు .
No comments:
Post a Comment