2013-11-06

కార్తెలు ఎలా ఏర్పడతాయి .

భూ పరిభ్రమణము గురించి మనకు తెలుసు . భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్యను 27 భాగములుగా విభజించి 27 నక్షత్రములు గా తెల్పితిరని మనము ఇంతకు ముందు చెప్పుకొన్నాం .

జ్యోతిష్య శాస్త్రము ప్రకారము సూర్యుడు ఏ నక్షత్రములో ఉంటాడో ఆ నక్షత్ర ము పేరుగల కార్తె గా చెప్పుచున్నారు . కానీ ఇది వాస్తవము కాదు . ఎందుకంటే సూర్యుడు నిశ్చలంగా ఉన్నాడు . భూమితో సహా మిగాతా గ్రహములన్ని  సూర్యుని చుట్టే తిరుగు చున్నవని విజ్ఞాన శాస్త్రవేత్తలు నిరూపించినారు కదా. మరి అటువంటప్పుడు సూర్యుడు నిశ్చలముగా ఉన్నప్పుడు లేక సూర్యునకు కక్ష్య లేనప్పుడు వివిధ నక్షత్రములలో ఎలా ప్రవేశిస్తాడు ?

ఇక్కడ ఒక్క విషయమును మనము గ్రహించాలి . సైన్సు , వాతావరణ విభాగము అభివృద్ది కాక మునుపు మన పూర్వీకులు కార్తెల వలన ఉష్ణోగ్రతలను , వర్ష సూచన లను తెలుసుకొని తదనుకూలంగా వ్యవ సాయము చేసే వారు .

ఈ కాలములో కూడా గ్రామాలయందు ప్రభుత్వము వారి సంస్థ అయిన వాతావరణ కేంద్రము వారిచ్చే సలహాల కన్నా ఈ కార్తెలను బట్టే విత్తనములు నాటడం జరుగుచున్నది .

ఉదా : అగ్ని కర్తరి సాధారణముగా ప్రతి సంవత్సరము మే నెల 4 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు ఉంటుంది . 4 నుండి  11 వ తేదీ వరకు నడిచే కార్తెను డొల్లు కర్తరి గాను , 11 నుండి 28 వరకు నడిచే కర్తరిని నిజ కర్తరిగానూ విభజించారు.

సూర్యునకు  కక్ష్య లేదని మనము తెలుసుకొన్నాము .
భూమికి కక్ష్య ఉన్నది . భూమి తన కక్ష్యలో రోజుకొక డిగ్రీ చొప్పున దీర్గ వృత్తాకారముగా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ కక్ష్య  27 నక్షత్రములుగా విభజించబడినది . భూమి తన సంచారములో ఒక నక్షత్రమును విడచి మరొక నక్షత్రములో ప్రవేసించగానే ఆ నక్షత్ర నామము గల కార్తె ఏర్పతుందని తెలుసు కోవాలి .         

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...