2014-03-12

మూర్తుల ప్రభావము

ఏ జాతకునకైనా ఫలితములను గురించి తెలుసు కోవాలని అనుకొన్నప్పుడు రెండు విధముల అనాలసిస్ అవసరం అవుతుంది .

అది ఒకటి గ్రహచారము , రెండవది గోచారము
గ్రహచారము అనగా మనం పుట్టినప్పుడు ఉన్న గ్రహముల స్థితి ఆధారముగా గ్రహములు పొందిన రాశి యొక్క స్వభావమును అనుసరించి గ్రహ దశలను తెలుసుకొని జన్మ లగ్నము లగాయితూ గ్రహములు పొందిన  ఆధిపత్యము ననుసరించి ఆయా గ్రహముల బలాబలములను  ఫలితములను తెలుసు కోవడం.

ఇక రెండవది గోచారము ఈ విధానములో వర్తమాన పరిస్థితులలో గ్రహముల గతిని అనుసరించి కలుగు మార్పులకు అనుగుణముగా మానవ జీవితముపై కలుగు  శుభ ,అశుభ ఫలితములను క్షున్నముగా తెలుసుకొనుటకు ఉపయోగ పడుతుంది .  గోచారము ప్రకారము గ్రహములకు ఫలితములను తెలుసుకోవాలని అనుకొన్నప్పుడు జన్మ లగ్నమును ప్రామాణికముగా తీసుకోకూడదు . ఇక్కడ జన్మ రాశి  మాత్రమే పరిగణన లో తీసుకోవాలి . ఎవరైనా ఒక వ్యక్తి యొక్క గోచారము ఫలితమును సులభంగా తెలుకోవడానికి మహర్షులు గ్రహములకు మూర్తి నిర్ణయము చేసినారు . ఈ మూర్తులను లోహములతో పోల్చి చూపారు .

పంచ లోహాలలో బంగారము , వెండి , రాగి , ఇత్తడి  , ఇనుము . ఇవి ఒకదానికన్న ఒకటి తక్కువ విలువ కలవి . ఉదా : బంగారము చాలా విలువ కలిగినది దానికన్నా వెండి తక్కువ విలువ దానికన్నా రాగి , దానికనా ఇత్తడి , దానికన్నా ఇనుము ఇలా విలువ తగ్గి పోతుంది .

ఈ లోహాలకున్న విలువలకు అనుగుణముగా సాధారణ మానవునకు కూడా సులభంగా అర్ధం అవుతుందనే ఉద్దేశ్యంతో మన పూర్వీకులు గ్రహములకు మూర్తి నిర్ణయము చేసారు .

1 సువర్ణమూర్తి (బంగారము )2 రజిత మూర్తి( వెండి )3 తామ్ర మూర్తి (రాగి ) 4 లోహ మూర్తి (ఇనుము 0 

సువర్ణ మూర్తి 100 %  శుభ ఫలితములను
 రజిత మూర్తి 75% శుభ ఫలితములను
తామ్ర మూర్తి 50% శుభ ఫలితములను
లోహ మూర్తి  25% శుభ ఫలితములను ఇచ్చును . ఈ గ్రహములకున్న మూర్తి ప్రభావము ప్రకారము   .

మూర్తి నిర్ణయము ఎలా చెయ్యాలి అనే విషయములను తదుపరి శీర్షికలో తెలుసు కుందాం .

2014-02-23

షడ్గుణములు- గ్రహ ప్రభావము

మానవుడు షడ్గుణములచే ప్రభావితమగును . షడ్గుణములను జయించువాడు పురుషోత్తముడు , ఉత్తమ పురుషుడుగా ప్రసిధ్ధిగాంచును. షడ్గుణములనబడు కామ, క్రోధ, లోభ, మోహ,మద, మాత్సర్యము అనబడే ఆరు గుణములచే దుర్గతి పాలగును. ఈ షడ్గుణములు కు జాతకుడు లోనగుటకు గల కారణములు ఏమిటి. ఏ గ్రహముల స్థితి వలన దురలవాట్లకు బానిస అగుచున్నాడు అను విషయములను గురించి తెలుసుకుందాం ?
జాతక చక్రములొ ఉన్న గ్రహముల స్థితిని అనుసరించి జాతకునకు ఉండే దురలవాట్లను తెలుసుకోవచ్చును .

మానవుని ఆలోచనలను ప్రభావితము చేసే గ్రహము చంద్రుడు. చంద్రుడు మనస్సుకు కారకుడు . ఈ చంద్రుని స్థితి వలన జాతకుని ఆలొచనలలో మార్పులు సంభవించును.చంద్రుడే ఆలోచనలపై ప్రభావమును చూపును. చంద్రునిపై ఉన్న ఇతర గ్రహముల ప్రభావమును బట్టి పైన తెలిపిన గుణములకు ఆకర్సింపబడును.

కామమునకు ,మోహము,  మాత్సర్యములకు శుక్రుడు కారకుడు,
 క్రోధమునకు కుజుడు కారకుడు,
 మదమునకు రవి కారకుడు ,
 లోభమునకు శని కారకుడు.

శుక్రుడు నీచ స్థితిని పొందినా పాపగ్రహముల ప్రభావమునకు లోనై చంద్రునితో సంభంధము కలిగినచో స్త్రీలపై మక్కువ ఎక్కువ , కామ వాంచ అధికము. చపల మనసు కలిగి ఉండుట, వ్యసనము నకు లోనగుదురు. వీటికి రాహు గ్రహ సంభంధము కలిగితే వావి వరసలు మరచి ప్రవర్తింతురు.

కుజుడు నీచను పొందినా పాపగ్రహముల ప్రభావమునకు లోనైనా  విపరీతమైన కోపము కలిగి ఉండును.
అదే విధముగా రవి గ్రహము బలహీనమై ఉన్నప్పుడు  అహంకారపూరితముగా వ్యవహరించుట జరుగును.
శని గ్రహము స్థితి చెడినప్పుడు తొందరగా ఎవ్వరినీ నమ్మరు . వీరికి ఇతరులపై నమ్మకము తక్కువ. ప్రతి విషయములో లోభి తనము ఉంటుంది. పశు ప్రవృత్తి కలుగును

2014-02-19

సంధి వివరణ

సాధారణముగా జాతకమును పరిశీలించేటప్పుడు మరియు ముహోర్తమును లెక్క వేయునపుడు సంధిని గురించి ప్రస్తావన వస్తుంది.ఈ సంధులలో అనేక రకముల తేడాలు ఉంటాయి. ముందుగా సంధి అంటే ఎమిటీ అనే విషయములను తెలుసుకుందాం.సంధి అంటే రెండు విషయముల మధ్య , లేక రెండు సంఘటనల మధ్య ఉండే సమయమును తెలియ పరచునది.

దీనిలో అనేక రకములు ఉన్నవి.

1 తిధి సంధి 2 నక్షత్ర సంధి 3 రాశీ సంధి 4 లగ్న సంధి
రెండు తిధుల మధ్య వుండే కొంత సమయమును తిధి సంధి అంటారు .
అలాగే రెండు నక్షత్రముల మధ్యన ఉండే సమయాన్ని నక్షత్ర సంధి అంటారు.
అలాగే రెండు రాశుల మధ్యన, రెండు లగ్నముల మధ్యన ఉండే సమయాన్ని కూడా సంధి గానే లెక్కించడం జరుగుతుంది.

తిధులు, నక్షత్రములు , రాశులు , లగ్నములు మధ్య అటు ఇటు సుమారు 12 నిమిషములు సంధి ఉండును.
ముఖ్యముగా ఈ సంధి సమయము ఎలాంటి శుభ కార్యములు నిర్వహించుటకు పనికిరాదు . మరియు ఈ సన్ధి సమయములలో జన్మించిన వారికి పూర్ణాయుర్ధాయము ఉండదు.


సంధికి సంబంధించి మనకు పురాణములలో ఒక కధ ఉన్నది .
హిరణ్యకసిపుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మనుండి వరము పొందుతాడు.
తనకు కత్తి చేత గానీ , కర్ర చేత గానీ , మనుష్యుల వలన గానీ , జంతువుల వలన గానీ దేవతల వలన గానీ, రాక్షసుల చేత గానీ , ఆయుధముల వలన గానీ , ఇంట గానీ , బయట గానీ , పగలు గానీ , రాత్రి గానీ చావు కలుగ కూడదు అని వరాన్ని పొందుతాడు. ఆతని అకృత్యములకు శిక్షించాలని వైకుంట వాసుడైన శ్రీహరి నరసింహ అవతారమెత్తి అతనిని సంహరించాడు.


హిరణ్య కసిపుని సంహరించిన సమయము పగలు రాత్రి గానీ సూర్యాస్తమయము జరిగె సమయము.
సంహరించిన ప్రదేశము ద్వారము పై అనగా ఇంటా కాదు , బయటా కాదు.
సంహరించిన అవతారము నృసింహ అవతారము అనగా పూర్తిగా జంతువు కాదు అలాగనీ మనిషీ కాదు.
దీనిని బట్టి మనకు అర్ధమగుచున్నది .

సంధి అనగా సంబంధిత తిధి నక్షత్రము రాశులకు ఎ ఒక్క దానికి చెంది పరిపూర్ణ ఫలితమును ఇవ్వజాలదు. 

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...