జాతకము నందున్న దోషము లను తెలుసు కొని రత్నము లు
ధరించుట వలన గ్రహ దోషము లు తొలగి దీర్గాయు రారోగ్త్యములు ,అభివృద్ది , ధన సమృద్ధి
కలిగి మానవుడు సుఖ సంతోషములను పొందును .
సూర్య భగవానుని ప్రతి రూపమే కెంపు . ఈ
కెంపును ధరించుట వలన ధైర్య సాహసము లు పెరుగును . గట్టి పట్టుదల కలిగి అనుకొన్నది
సాధించ గలరు . రాజకీయము లందు రాణించెదరు . సంఘం నందు గౌరవ మర్యాద లు పెరుగును . సాన
పట్టిన కొలది కాంతి వంతము గా ఉండే కెంపు చాలా ప్రశస్త మైనది. శ్రీలంకలో దొరుకు కెంపు
చాల ప్రశస్త మైనదని అందురు .
ఈ కెంపు లలో మాణిక్యము, పద్మ రాగము , సౌగందిక,ము , కురు విందము , మాంసగంధి,
నీలగంధి, లాలు గంధి అను పేర్లు కలవు .ఇది ఎరుపు రంగులో ఉంటుంది . బీటలు , పగుళ్ళు
లేని కెంపును ధరించుట మంచిది .
సరియైన కెంపును అగ్ని లో పెట్టి కాల్చి ననూ
పగలదు. చల్ల బడగానే బూడిద రంగును పొందును . కొంత సేపటికి ఆకు పచ్చ రంగుతో కనపడును .
పూర్తిగా చల్లబడి నపుడు . ఉదయించు సూర్యుని వలె ఎరుపు రంగును పొందును .
ఈ విధమైన కెంపు ప్రసిద్ధ మైనది.
రత్నములు ధరించుట కు వివిధ రకముల
పద్దతుల ను అనుసరించు చున్నారు.
నవ గ్రహము లకు రాజు సూర్యుడు కనుక సంఖ్యా
శాస్త్రము ప్రకారము 1 సూర్యుని సంఖ్య.
1 , 1 0, 19, 28 తేదీ లలో జన్మించిన
వారు., కృత్తిక , ఉత్తర , ఉత్తరాషాడ ,
నక్షత్రము లలో జన్మించిన వారును , మరియు సింహ రాశి , సింహ లగ్నములలో జనించిన వారు ఈ
రత్నమును ధరించుట మంచిదని మహర్షులు చెప్పితిరి
No comments:
Post a Comment