వజ్రము నకు భారతదేశములో విశేష చరిత్ర ఉన్నది. పూర్వకాలములో మహారాజులు ,
రాజ్యాధినేతలు వీటిని విలువైన సంపద గానూ , హోదాకు చిహ్నము గానూ భావించేవారు. ప్రస్తుత కాలములోనూ వజ్రములు ఎంతో విలువ కలిగినవి అతి ఖరీదైనవి .
భారత దేశములో ఒకప్పుడు ఉన్నటువంటి కోహినూర్ వజ్రము ప్రపంచ ప్రసిద్ది గాంచినది .
వజ్రము నకు సకల శాస్త్ర పారంగతుడు , సకల భోగ ప్రదాత అయిన శుక్రుడు
అధిపతి ..నవ రత్నము లలో అతి ప్రసిద్ది పొందినది. అతి విలువైనది వజ్రము. .వజ్రములు
ప్రపంచములో కొన్ని ప్రాంతములలో దొరుకు చున్నవి .వజ్రములు తెలుపు, ఉదయించే సూర్యకాంతి వాలె కొద్ది ఎరుపు
వర్ణము , కొంచెం పచ్చ రంగులోనూ , నలుపు రంగుల్లో ఉండును. సాన పట్టిన తరువాత
వజ్రమును పోల్చుట కష్టము . తెలుపు రంగు వజ్రము ధరించుట ఉత్తమము.
వజ్రము పగుల కొట్టిన పగలదు . రంపంతో కోసిననూ , ఆకురాయి తో గీసిననూ గీతలు
పడకుండా ఉన్న వజ్రము మంచిది. వజ్రమును నీటిలో వేసిన మునగదు. కాంతివంతమైన బీటలు
లేని వజ్రములను ధరించుట వలన నిత్య సంతోషములను అనుభవింతురు .
సంఖ్య శాస్త్రము ప్రకారము శుక్రుడు సంఖ్య 6
6, 15, 24 తేదీలలో జన్మించిన వారు భరణి , పుబ్బ , పూర్వాషాడ
నక్షత్రములలో పుట్టిన వారు వృషభ రాశి, తుల రాశులలో పుట్టిన వారు వజ్రమును ధరించుట
వలన జీవితము సుఖప్రదముగా దాంపత్యము అన్యోన్యత గలిగి ఆనందమయముగా ఉందురు.
ఉదయించే సూర్యుని కాంతి వలె ఉండే వజ్రమును
ధరించుట వలన రాజ్యాధికారము కలుగును . ఉన్నత పదవులలో రాణింతురు.. కొంచెం బంగారు
వర్ణములో ఉన్న వజ్రమును ధరించుట వలన వ్యాపారములో విశేష అభివృద్ది కలుగును .
సంగీతము , సాహిత్యము , గాయకులు మరియు
కళారంగములలో ఉన్నవారికి విశేష యోగము కలుగును . వివాహము కాని వారు వజ్రము
ధరించుట వలన జాతక దోషములు తొలగి వివాహము జరుగును.
No comments:
Post a Comment