2013-10-22

సంవత్సరము

భూమి సూర్యుని చుట్టి వచ్చుటకు 364.75  రోజులు పట్టుచున్నది . ఈ సంవత్సర కాలమును  ౩ భాగములుగా విభజించ బడినది . 1  వేసవికాలము 2  వర్షాకాలము ౩ శీతాకాలము  
 జూన్21 వ తేది సమయములో కర్కాటకరేఖపైన సూర్యకిరణములు ఉచ్చముగా ఉండుట వలన భూమి ఉత్తరార్ధ గోళమున వేసవిగాను దక్షిణార్ధ గోళమున శీతాకాలము  డిశంబరు 22 వ తేది సమయములో  మకరరేఖపై  సూర్యకిరణములు ఉచ్చముగా ఉండుట వలన దక్షిణార్ధ గోళమున వేసవిగాను ఉత్తరార్ధ గోళమున శీతాకలము ఏర్పడుచున్నవి .

భ చక్రము 360డిగ్రీలు అనుకొన్నప్పుడు మొత్తం 12 రాశులు. ఒక్కొక్క రాశిని ౩౦ డిగ్రీలుగా చేసి వాటికి మన మహర్షులు పేర్లు పెట్టారు . అవి  మేషము , వృషభము, మిధునము , కర్కాటకము , సింహము , కన్య , తుల, వృశ్చికము , ధనుస్సు , మకరము , కుంభము , మీనం.

భారత దేశములో  జనవరి 14 న సూర్యుడు మకరరాశిలో  ప్రవేశించు సమయ మకర సంక్రమణమని ఈసమయమునే ఉత్తరాయణ పుణ్యకాల మనియు అందురు . సూర్యుడు రాశి ప్రవేశము జరుగుట కాదు. భూమి తన కక్ష్యలో 27౦వ డిగ్రీ నుండి 90 వ డిగ్రి వరకు ఉత్తరమునుండి దక్షిణదిశగా వెళ్ళుచున్నది . ఈకాలములో ఆకా ములో సూర్యుడు దక్షిణము నుండి ప్రతి రోజు కొంత భాగము ఉత్తరమునకు వెళ్ళు చున్నట్లు కనబడును . దీనినే ఉత్తరాయణ పుణ్యకాలమని అందురు .   
అదే విధంగా జులై14 కర్కాటక రాశిలో  భూమి 90 వ డిగ్రీలో ప్రవేసిస్తుంది .దీనిని దక్షిణాయన మనియు దక్షిణాయన పుణ్య కాలమనియు అందురు . ఈ కాలములో సూర్యుడు ఆకాశములోఉత్తరమునుండి దక్షిణ దిశకు వెళ్లినట్లు కనబడును . ఈ విధంగా సంవత్సరమునకు రెండు ఆయనములు ఏర్పడుచున్నవి.   

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...