2013-12-26

బొట్టు ప్రాముఖ్యత

భారతీయ సంప్రదాయములో హిందువులు బొట్టును ధరించడం అనాదిగా వస్తున్న ఆచారము . బొట్టు ధరించుట వలన తేజస్సు పెరుగుతుంది . ముఖ్యంగా స్త్రీలు బొట్టును ధరించుట వలన ముఖము నందు తేజస్సు పెరగడమే కాకుండా అందము తో పాటు లక్ష్మీ కళ  వస్తుంది .ఐశ్వర్యము కలుగుతుంది .

 బొట్టును దరించడానికి ఉపయోగించే కుంకుమ సహజ సిద్దంగా తయారు చేసినది అయి ఉండాలి . సహజ సిద్దంగా తయారు చేసే కుంకుమ లో పసుపును వాడతారు . దీని వలన ముఖరోగాలు , నశించడం జరుగుతుంది . జ్ఞాన నేత్రం పై కుంకుమను ధరించడం కంటి చూపు బాగు పడుతుంది . ముఖపై మొటిమలు మొదలగు వ్యాధులను నయం చేస్తుంది .

 పసుపు యొక్క ప్రాముఖ్యతను గురించి, పసుపును వాడడం వలన కలిగే లాభాలను గురించి  సైంటిస్టులు చాలా సందర్భాలలో చెప్పుచునే ఉన్నారు . పసుపు యాంటి బయాటిక్ గా ఉపయోగ పడుతుంది . అందుకనే ఏమో ఈ విషయాన్ని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు . బొట్టును ధరించడం ఆచారమని తెలియ పరచారు . ప్రస్తుతము ఈ కాలములో ప్యాషన్ కొరకు  మెహంది బొట్టు బిళ్ళలు , ప్లాస్టిక్ బొట్లు వాడుచున్నారు . దీనివలన అందం వస్తుంది . గానీ ముఖ రోగాలు నశించవు.

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...