2014-05-06

మూర్తి నిర్ణయం చేయడం ఎలా ?

గ్రహములు నిత్యమూ పరి భ్రమణము చెందుతూనే ఉంటాయి .
ప్రతి గ్రహము తన కక్ష్య ను అనుసరించి ముందుకు కదులుతూ ఉంటుంది . అలా గ్రహములు ఒకరాశినుండి మరొక రాశిలోకి ప్రవేశించు సమయమును తెలుసుకొని మూర్తి నిర్ణయము చేయబడుతుంది .
ప్రతి సంవత్సరము మనం రాశీ ఫలితములను తెలుసుకోవడం అనేది అనాదిగా వస్తున్నా ఆచారము . దీనికి ప్రత్యేకించి  ఒక సమయాన్ని నిర్ణయించడం జరిగింది .

మన తెలుగు వారు ముఖ్యముగా ఉగాది నుండి సంవత్సరము ప్రారంభము అయినట్లుగా భావించి రాశీఫలితములను తెలుసుకోవడం జరుగుతుంది . ఉగాది సమయములో ఉన్న గ్రహముల స్థితి ప్రకారము మాత్రమే సంవత్సర ఫలితములు ఆధారపడి ఉండవు . గ్రహములలో నిత్యమూ జరుగు సంచారమును బట్టి మానవునకు కలుగు శుభ, అశుభములు ఆధారపడి ఉంటాయి . వీటిని సూక్ష్మముగా తెలుసుకొనుటకు వీలుగా ఉంటుందని మూర్తుల నిర్ణయము చేయడం జరిగింది .
ఏ ఏ మూర్తుల వలన ఏవిధమైన ఫలితములు కలుగుతాయి అను విషయములను మనం ఇంతకూ ముందర శీర్షికలలో తెలుసు కున్నాం .
ఇప్పుడు ఈ మూర్తులను ఎలా నిర్ణయించాలి అను విషయములను తెలుసుకుందాం .
చద్రుని గమనము వలన నక్షత్రములను తెలుసుకోవడం జరుగుతుంది . మనకు మన జన్మ నక్షత్రము తెలిస్తే జన్మరాశి తెలుస్తుంది . జన్మ నక్షత్రము తెలియని వారికి పేరు లో ఉన్న మొదటి అక్షరమును బట్టి నక్షత్రము తెలుసుకోవచ్చు . ఆ విధముగా పేరులో ఉన్న మొదటి అక్షరము ప్రకారము ఏ నక్షత్రము అవుతుందో గుర్తించి , ఆ నక్షత్రము ఏ రాశికి చెందినదో తెలుసు కొనుట చాలా సులభము

మీ పేరులోని మొదటి అక్షరము ప్రకారము మీది ఏ నక్షత్రము ఏ రాశి అను విషయము తెలుసు కోవాలంటే ఈ దిగువన ఉన్న లింకును క్లిక్ చెయ్యండి .

జన్మ లేక నామ నక్షత్రము తెలుసుకున్న తరువాత జన్మరాశిని  లేక నామ రాశిని తెలుసుకోవాలి .
ఏ గ్రహమునకు మూర్తి నిర్ణయము చేయవలెనో మొదట గుర్తించాలి . పిమ్మట ఆ గ్రహము ఏ రోజున ప్రవేశించు చున్నది . గ్రహము ప్రవేశించు రోజున ఉన్న నిత్య నక్షత్రము ఏమిటి ? ఆ నక్షత్రమునకు సంభందించిన రాశి ఏమిటి అను విషయమును జాగ్రత్తగా లెక్కించ వలెను . ఆ విధముగా లిక్కింపగా వచ్చిన రాశి సంఖ్యను బట్టి మూర్తి నిర్ణయము చేయాలి .
జన్మరాశి లేక నామ రాశి నుండి
1  6    11  రాశులలో ఉన్న గ్రహములు సువర్ణ మూర్తులు
2  5    9  రాశులలో ఉన్న గ్రహములు రజిత ( వెండి ) మూర్తులు.
3   7   10  రాశులలో ఉన్న గ్రహములు తామ్ర ( రాగి ) మూర్తులు
4   8   12   రాశులలో ఉన్న గ్రహములు లోహ ( ఇనుము ) మూర్తులు


ఈ విధముగా మూర్తి నిర్ణయము చేయాలి . పంచ లోహాలలో వాటికి ఉన్న విలువను ఆధారముగా చేసుకొని గ్రహములు ఇచ్చు శుభ ఫలితములను తెలుసుకొనుటకు వీలుగా ఉంటుందని ఈ మూర్తి నిర్ణయము చేయడం జరిగింది .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...